పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Saturday, December 5, 2009

మేలుకొలుపు..

కె.సి.ఆర్.కు "బూతుల ధీర" బిరుదు ప్రదానం

      మీ హాస్య చతురతకు నా అభినందనలు.ముందుగా నేను తెలుగువానిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. మనం భావ వ్యక్తీకరణకు భాషను వాడతాం. భాషను మరొక అర్థం లో వాక్కు అని కూడా అంటారు. వాక్కుకు అధిపతి లేదా స్వరూపం సరస్వతి. తల్లికి సరస్వతికి మనం సమ గౌరవం, సమానార్ధం ఇస్తాం కాబట్టి "తెలుగు తల్లి" అన్నారు. ఇక తెలంగాణా తల్లి ఎలా వచ్చిందో నేను వివరించక్కర్లేదు అనుకుంటున్నాను. తెలంగాణా అని గిరి గీసుకున్న మాత్రమున సామాన్య మానవుడి కష్టాలు తీరిపోతాయంటే..అంతకంటే కావలిసిందేముంది. మన రాజకీయ నాయకుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. తెలంగాణా ప్రాంత నాయకుడు కావచ్చు లేదా ఆంధ్రా ప్రాంత నాయకుడు కావచ్చు లేదా మరొక నాయకుడు కావచ్చు. ఈ స్వతంత్ర భారత దేశంలో ఎవరి అభిప్రాయం వారు నిస్సందేహంగా వెలిబుచ్చవచ్చు. ఒకరు మేము తెలంగాణాకి వ్యతిరకం అన్నంత మాత్రమున లేదా మేము తెలంగాణాకి సానుకూలం అన్నంత మాత్రమున వారి మీద కక్ష కట్టటడం లేదా దాడి చేయడం ఖండించదగినది. ఎవరి అభిప్రాయాలూ వారివి.. కాదా? ఈ రోజున వరద తాకిడి వల్ల ఛిద్రమయిన బ్రతుకులని ఎవరయినా పట్టించుకుంటున్నారా? వరద వచ్చిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంస్థల విరాళాలు, విదేశాల నుంచి విరాళాల నిమిత్తం వచ్చిన డబ్బు ప్రజలనుంచి వసూలు చేసిన చందాలను వారికి సక్రమంగా అందాయా లేదా అని ఎవరికయినా సందేహం వచ్చిందా? కష్ట జీవులకు కావలిసింది.. నమ్మకం.. ఈ రోజు కాకపోయినా రేపు మన జీవనం మెరుగవుతుంది అన్న విశ్వాసం. అటువంటి నమ్మకం ఈ నాయకులలో ఒక్కరైన నాకు కలిగించారని అనుకోను. ఈరోజు మా ఇంటి అద్దె 6౦౦౦/-. రేపు తెలంగాణా వచ్చినా రాకున్నా నేను ప్రతినెలా చెల్లిన్చవలిసిందే. నేను తెలంగాణా వాడినైన మాత్రాన మా ఇంటి యజమాని(అతనూ తెలంగాణా వాడేలెండి) ఊరికినే ఇల్లు ఇవ్వడు కదా..! ఈరోజు పప్పు ధర ఒక కే.జి. 80/- (తక్కువలో తక్కువ). కోడి గుడ్డు రూ. ౩.50 /- ఎవరికి పట్టింది? మనం మనుషులమని మరచి చాలా రోజులయింది. నాయకుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారి చాలా రోజులయింది. మరొక విషయం, "గాలి"వాటమేమయింది? తెలంగాణా అంశంతో కొట్టుకుపోయిందా? బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్ళిన తర్వాత, మనము సాధించిన విజయాలు వాటి నాణ్యతలను రంగాల వారిగా పరిశీలిస్తే మనం గర్వంగా చెప్పుకోదగ్గవి ఎన్ని? స్వదేశంలో మనమే ఇలా ప్రాంతాల వారిగా, కుల, మత ప్రాతిపదికగా, భాషా ప్రాతిపదికగా కొట్టుకుంటున్నప్పుడు, ఆస్ట్రేలియా లేదా విదేశాలలో భారతీయుల పైన దాడులు జరిగినప్పుడు ఖండించడంలో ఎంతవరకు అర్థం ఉందో నాకర్థం కాదు. మధ్య ఐరోపాలో 7 దేశాలు ఒకే నదీ జలాలను ఎటువంటి సమస్యా లేకుండా వాడుకుంటున్నాయి.  ఇక మన విషయం ప్రస్తావిన్చక్కర్లేదనుకుంటా.
        పూర్వపు తరం ఉద్యమ నాయకులకు, ఈ తరం ఉద్యమ నాయకుల స్పష్టమైన బేధం ఉంది..! లేదంటారా? మన నాయ"కుల"కు కావలిసింది వారి యొక్క రాజకీయ భవిష్యత్తు. ప్రజల కష్టనష్టాలు కాదు. ఎవరి ప్రాంతం మీద వారికి, ఎవరి భాష మీద వారికి అభిమనముండవచ్చు. కాని ఎదుట వ్యక్తిని సహించలేనంత దురభిమానముకూడదు. సమస్యల పరిష్కారము కోసం ప్రయత్నించవచ్చు. కానీ క్రొత్త సమస్యను కొనితెచ్చుకోవటం అవివేకమౌతుంది. ఒక బస్సు తగలపెడితే 5 -7 గురు నిరుద్యోగులవుతారు. వారు తెలంగాణా వారు కావచ్చు లేదా ఆంధ్ర ప్రాంతం వారు కావచ్చు లేదా మరే ప్రాంతం వారైనా కావచ్చు. ఈ రోజు ఆందోళనల్లో పోయిన ప్రాణాలకు బాధ్యత ఎవరిది? నష్ట పరిహారం చెల్లిస్తే సరిపోయినట్టేనా?
           జీవితపు నాణ్యత గురించి నాయకులను ప్రశ్నించండి. వేరొక రాష్ట్రం గురించి పోరాడమంటున్నారు సరే.. మరి వారి దగ్గర సరయిన ప్రణాళిక ఉందా? ఏదయినా సమస్యకు పరిష్కారం చూపించేటప్పుడు ఈ మౌలికమయిన అంశాలకు పరిష్కారాన్ని కూడా వివరిస్తే మాలాంటి అజ్ఞానులకు అర్థం అవుతుంది.  మా బ్రతుకుకు, మా బిడ్డల భవిష్యత్తుకు వారి దగ్గర సమాధానం ఉందా? లేక తెలంగాణా అని పేరు మార్చుకుని మురిసిపోవడమేనా?

5 comments:

  1. మీరన్న విషయం నేను ఏకీభవిస్తాను, కాని ఎవరికి పట్టాయి వాస్తవాలు..? ఇంకో అనుమానం " ఆంధ్ర " అన్న పదం కేవలం సర్కారు ప్రాంతం వారికే చెందినట్లు సంబోదిస్తున్నారే..? నాకు తెలిసి ఆంధ్ర అన్న పదం రాష్ట్రానికి అన్ని ప్రాంతాలను కలిపి పిలుచుకొనే పదం అనుకున్నాను, ఇక్కడ అందరు కేవలం సర్కారు ప్రాంతం వారినే ఆంధ్రులు అని పిలుస్తునారు..? నా అనుమానం తీర్చగలరు..

    ReplyDelete
  2. ధన్యవాదములు కమల్ గారు,
    నేను లంకె వేసిన టపా మహత్యమేమో..?? :-)) ఏం చేస్తాం చెప్పండి మన ఖర్మ కాక పోతేను.. ఆంధ్ర అని అందరిని కలిపివాడితే - నేను "జై ఆంధ్రా" కి జై కొడుతున్నానని అపార్థం చేసుకుంటారని, విడి విడిగా తెలంగాణా, ఆంధ్రా, రాయలసీమ అని చెప్పుకోవలసిన దుస్థితి. కొంచెం టపాలో సరళత (కొందరు అజ్ఞానులకు ఆంధ్రా అంటే "ఉభయ గోదావరి, కృష్ణ, ప్రకాశం, విశాఖ, విజయనగర శ్రీ కాకుళాలు" మాత్రమే అని మనవి చేసుకోవడానికి ఒక ఆంధ్రుడుగా సిగ్గుపడుతున్నాను"), భావ వ్యక్తీకరణ సౌలభ్యం కోసం వాడవలసి వచ్చింది. మరొక విషయం, ఆంధ్రప్రదేశ్ గా అవతరించి 60 వసంతాలు కావొస్తున్నా మనమింకా బయటవారికి (విదేశీయులకు) "మదరాసీలమే". ఈ తరుణంలో మన ఖ్యాతిని ద్విగుణీకృతము చేయటం పోయి, మనలో మనం కొట్టుకుంటూ మనకు ఒక దారి చూపిన మహానుభావుల నిజాయితీని, త్యాగనిరతిని ప్రశ్నించటం తెలుగు జాతికి అంత శ్రేయస్కరం కాదేమో?

    "మేము చేస్తే నిరాహార దీక్షలు కావు కాని పొట్టి శ్రీరాములు చేస్తే అది నిరాహార దీక్షా అని ఒక పెద్దాయన ప్రశ్న!!" దీనికి నేను నవ్వాలా, ఏడవాలా??!?

    మీ వ్యాఖ్యకు నా కృతఙ్ఞతలు.. "రాబోయే రోజులు మన ఆంధ్రులవని ఆశిద్దాం.."

    ReplyDelete
  3. శ్రావ్య గారు..మీ వ్యాఖ్యకు నా కృతఙ్ఞతలు.

    ReplyDelete
  4. క్షమించండి, ఏదో పరధ్యానం లో ఉండి మీ సందేహ నివృత్తి చేయలేదు. అసలు కథ ఇదీ.. ఇక్కడి ప్రజలు అంటే తెలంగాణా ప్రాంత వాసులు కోస్తా లేదా తూర్పు జిల్లాల నుంచి వచ్చే వారిని సంబోధించడానికి తమ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న పదం "ఆంధ్రా" అని. ఎందుకంటే, తెలంగాణా లో అధిక భాగం ఒకాప్పుడు నిజాం నవాబు ఆధీనం లో ఉండేది కాబట్టి తూర్పుజిల్లాల వారిని "అసలైన ఆంధ్రులుగా" పరిగణించడం మొదలయింది. కోస్తా జిల్లాలలో శ్రీకాకుళం వారిని తూర్పు వాళ్ళు అని సంబోధిస్తారే అలాగే ఇదీను..

    ReplyDelete

మీ వ్యాఖ్యలకు ముందుగానే కృతఙ్ఞతలు.